ఇటీవల తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. అదినేత చంద్రబాబు మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు కూడా పోలవరం ప్రాజెక్టు ను సందర్శించారు.

Image result for polavaram chandrababu family

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ నా హయాంలోనే పూర్తవుతుందని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రైతాంగానికి పోలవరం ప్రాజెక్టు వెన్నెముక లాంటిది అని ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపురేఖలు మారిపోతుందని అన్నారు.

Image result for polavaram

ఇంత విశిష్టత కలిగిన పోలవరం ప్రాజెక్టుని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు సందర్శించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు చరిత్ర అని వ్యాఖ్యానించారు.

Image result for lokesh

ప్రాజెక్టులు కట్టాలంటే తరాలు మారిపోవడం ఆనవాయితీని, కానీ, పోలవరాన్ని నాలుగేళ్లలో ఓ రూపునకు తెచ్చామన్నారు. కేంద్రం వేసే కొర్రీలన్నింటికీ సమాధానం చెబుతున్నామని లోకేశ్ తెలిపారు. నిర్మాణ జాప్యంతో ప్రాజెక్టు ధరలు పెరుగుతాయని లోకేశ్ చెప్పారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పనులు ఇంకా త్వరగా పూర్తవుతాయని పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: