వంగవీటి పోటీ చేసే నియోజక వర్గం మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్నది.  వంగవీటి రాధాకు సీటు కేటాయింపు విషయంలో సాక్షిలో వచ్చిన కథనంతో వ్యవహారం రసవత్తరంగా మారింది. రాధాను మచిలీపట్నం బరి నుంచి దించాలని జగన్ భావిస్తున్నట్టుగా ఆయన సొంత పత్రికే చెప్పింది. అందులో కూడా విజయవాడ ఈస్ట్‌ను ప్రస్తావించారు. విజయవాడ సెంట్రల్ మాత్రం మల్లాది విష్ణుకే అని, బ్రహ్మాణ ఓట్ల సంఖ్య గణనీయంగా ఉన్న ఆ నియోజకవర్గంలో విష్ణు సరైన అభ్యర్థి అవుతాడని ఆ పత్రిక పేర్కొంది.

Image result for vangaveeti radha

అప్పటికే రాధాకు వైసీపీ అధిష్టానం తమ ఉద్దేశాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తోంది. జగన్ సొంత పత్రికలో ఈ వార్త రావడంతో రాధా ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. ఇక ఈ రోజు కూడా ఇది కొంత కొనసాగింది. రాధా-రంగ అభిమానులు వైసీపీ సభ్యత్వాలకు నిప్పు పెట్టారట. తను మూడు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని రాధా వారి ముందు ప్రకటన చేసినట్టుగా సమాచారం.

Image result for vangaveeti radha

ముందుగా మచిలీపట్నం ఎంపీ సీటు లేదా విజయవాడ ఈస్ట్ అని చెప్పిన వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు రాధాను ఈస్ట్ సీటు ద్వారా బుజ్జగించాలని చూస్తున్నట్టుగా అర్థమవుతోంది. 2004 ఎన్నికల్లో రాధా ఈ నియోజకవర్గం నుంచినే విజయం సాధించాడు. గత ఎన్నికల్లో మాత్రం ఇక్కడ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారాయన. మరి మరోసారి అక్కడ నుంచి పోటీకి సై అంటాడా? లేక జై జనసేన అంటాడా? అనేది కొన్ని గంటల్లోనే తెలిసిపోయే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: