ఏపీ పోలీసులు అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మధ్య తీవ్ర మాటల యుద్ధం నెలకొంది. పోలీసు వ్యవస్థపై ఇటీవల జెసి చేసిన వ్యాఖ్యలకు సీఐ మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడిన విషయం మనకందరికీ తెలిసినదే.
ఈ నేపథ్యంలో సై అంటే సై అంటున్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తా అని వార్నింగ్ ఇచ్చిన సీఐ మాధవ్ …...ఎక్కడికి రమ్మంటావు అంటూ కౌంటర్లు వేస్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి.
అంతే కాకుండా బాధ్యతగల పోలీసుల పదవిలో ఉండి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన సీఐ మాధవ్పై తాడిపత్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల నాలుకలు కోస్తానన్న వ్యాఖ్యలను జేసీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దివాకర్రెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటీవల ప్రబోధానంద స్వామి విషయంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులు..అలాగే పోలీస్ వ్యవస్థ గురించి ఇష్టమొచ్చినట్లు జెసి చేసిన వ్యాఖ్యలకు..సిఐ మాధవ్ వార్నింగ్ ఇచ్చారు...దీంతో రగడ మొదలైంది...తాజాగా జేసీ దివాకర్ రెడ్డి సీఐ మాధవ్పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య గొడవ రాజకీయ రంగంలోనూ పోలీసు వ్యవస్థను హాట్ టాపిక్ గా మారింది.