ఉత్తర ఆంధ్ర లో తుఫాన్ భీభత్సం చేసింది. చాలా మంది తుఫాను లో చిక్కుకు పోయారు దానితో చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తుఫాను కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. వందల కోట్లలో నష్టం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తుఫాను బాధితులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

Image result for jr ntr

ఈ నేపథ్యంలో నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రియాక్ట్ అయ్యారు. తిత్లీ తుఫాను కారణంగా నష్టపోయిన వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎన్టీఆర్ రూ. 15 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు ఈ నందమూరి స్టార్స్ పీఆర్ఓ మహేష్ ఎస్ కోనేరు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేశారు. ఎన్టీఆర్ రూ. 15 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షలు సహాయం అందించారు. అభిమానులు కూడా ఇందులో వారు భాగం కావాలని కోరారు అని వెల్లడించారు.

Image result for chandra babu

తిత్లీ విషయంలో అందరి కంటే ముందుగా సంపూర్ణేష్ బాబు రియాక్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా తిత్లి తుఫాన్ వల్ల చాలా నష్టం జరిగింది అని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను.....వెంటనే మన వంతు సాయంగా చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటున్నాను. నా వంతుగా Rs.50,000/- ఆర్థిక సాయం ముఖ్యమంత్రి గారి సహాయనిధి కి అందజేస్తాను... అని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: