హరికృష్ణ చనిపోవడం తో ఎన్టీఆర్ కుటుంబం పెద్ద లేకుండా తీవ్ర విషాదం లో కూరుకు పోయింది. అయితే హరికృష్ణ మరణంతో బాలయ్య మరియు చంద్ర బాబు తో ఎన్టీఆర్ కు స్నేహ సంభందాలు చిగురిస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. 2019 లో ఎన్టీఆర్ అవసరం టీడీపీ కి చాలా వరకు ఉందని చెప్పాలి. అందుకే చంద్ర బాబు ఎన్టీఆర్ తో స్నేహాన్ని కోరుకుంటున్నాడని, 2019 లో టీడీపీ తరుపున ప్రచారం చేయించాలని బాబు ప్లాన్ వేస్తున్నంటూ సమాచారం.


 అయితే  ఏపీలో ఇటీవ‌ల్ తిత్లీ తుఫాను దెబ్బ‌కి ఉత్త‌రాంధ్రా బాగా దెబ్బ‌తిన్న సంగ‌తి తెలిసిందే. తిత్లీ తుఫాను దెబ్బ‌కి అక్క‌డ చాలా కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి.. కొన్నిప్రాంతాలు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి.. తీవ్ర‌మైన ఆస్థి న‌ష్టం కూడా జరిగింది.  ఈ నేప‌ధ్యంలో తిత్లీ తుఫాను బాదితుల‌ను ఆదుకోవ‌డాని, ఏపి ప్రభుత్వం ఇప్పిటికే సహాయక చర్యలు చేపట్టిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా తిత్లీ తుఫాను దెబ్బ‌కి తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఉత్త‌రాంధ్ర సాయం చేయాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేంధ్రాన్ని కోరిన విష‌యం తెలిసిందే. అయితే మ‌రోవైపు తిత్లీ తుఫాను బాధితుల కోసం సిని ప్ర‌ముఖులు కూడా మేమున్నామంటూ తమ సపోర్ట్ అందిస్తున్నారు.

Image result for jr ntr

తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ తార‌క్ ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు త‌న వంతుగా 15ల‌క్ష‌లు ఆర్ధిక స‌హాయాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మంత్రి నారాలోకేష్.. ఎన్టీఆర్‌కు థ్యాక్స్ చెప్పారు. దీంతో ఈమ్యాట‌ర్ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే చాలా కాలంగా ఈ నంద‌మూరి హీరోకి.. నారావారి కుటుంబానికి మ‌ధ్య విబేధాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో లోకేష్- ఎన్టీఆర్‌కి థ్యాంక్స్ చెప్ప‌డంతో సోష‌ల్ మీడియాలో ఈ మ్యాట‌ర్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: