పవన్ కళ్యాణ్  ను ముంచిన , పైకి తెచ్చిన అతని అభిమానులే అయితే పైకి తేవడం పక్కన పెడితే వారి పిచ్చి పరాకాష్టకు చేరింది.ఎవరు తమకు అనుకూలమైన సర్వేలను ప్రచారంలోకి తీసుకురావాలన్నా లగడపాటి రాజగోపాల్ పేరును వాడుకొంటూ ఉంటారు. అదే విధంగా వీళ్లు కూడా లగడపాటి పేరును వాడేవారు. ఇక నంబర్ల విషయంలో వీళ్లు అసలే మాత్రం తగ్గలేదు. కనీసం ఇన్ని సీట్లకు జనసేనకు అభ్యర్థులు అయినా దొరుకుతారో లేదో కానీ.. ఏకంగా 71 సీట్లలో తమ పార్టీ గెలిచేస్తుందని చెబుతున్నారు.


తన అజ్ఞానాన్ని మళ్ళీ బయటికి పెట్టుకున్న పవన్...!

అంతేకాదట.. ఏపీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిందే జనసేనేనట! వీళ్ల కామెడీ మామూలుగా లేదండోయ్.. ఇప్పటివరకూ జనసేనకు తాడూ బొంగరం లేని రాయలసీమలో కూడా ఈ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందట. అనంతపురం జిల్లాలో ఇంకా పవన్ అడుగేపెట్టలేదు, అప్పుడే అక్కడ కూడా జనసేన ఐదుసీట్లు గెలిచేస్తుందట! అదెవరైనా సరే.. అక్కడ ఐదు సీట్లకు జనసేన అభ్యర్థుల పేర్లను చెప్పగలిగితే.. ఫలనా నియోజకవర్గంలో ఫలానా వ్యక్తి పోటీ చేస్తాడని చెప్పగలిగితే.. ఈ సర్వే వందకు వందశాతం రైటు అని చెప్పవచ్చు.

 సర్వే: జనసేనకు ఇన్ని సీట్లొస్తాయట

ఇక కడపలో రెండు, కర్నూల్లో అయితే ఐదు! చిత్తూరులో మెజారిటీ సీట్లు కూడా జనసేనవేనట. జనసేన ప్రభావం ఉండవచ్చు.. అని అంటున్న గోదావరి జిల్లాల్లో అయితే స్వీపింగేనట. తూర్పులో 14 సీట్లు, పశ్చిమలో 15 సీట్లు జనసేనే గెలిచేస్తుందట. ఇక మిగిలిన ఒకటీ రెండు సీట్లను వైసీపీ, టీడీపీలు పొందుతాయట. ఇదీకథ. ఈ ఫేక్ సర్వేను సగర్వంగా పంచుకుంటున్నారు పవన్ కల్యాణ్ అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: