అనుమానం పెనుభూతం అని అంటారు..ఈ మద్య చాలా మంది వైవాహిక జీవితంలో ఈ అనుమానాలు ఎన్నో అనార్థాలకు దారి తీస్తున్నాయి.  పెళ్లి చేసుకొని నూరేళ్లు కలిసి ఉంటారని పెద్దలు దీవించి పంపుతారు..కానీ భార్యా భర్తల మద్య తలెత్తుతున్న అనుమానాలు చివరికి ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి.  మరోవైపు కొంత మంది స్త్రీలు, పురుషులు శారీరక సుఖం కోసం అక్రమ సంబంధాలు కొనసాగిస్తు..వారికి అడ్డంగా ఉన్నారని భర్తను భార్య..భార్యను భర్త చంపుకుంటున్నారు. 

తాజాగా ఢిల్లీకి చెందిన కామీల్ అనే వ్యక్తి తన భార్య రేష్మపై అనుమానం రావడం..కొంత కాలంగా తనలో తాను మదనపడుతూ వచ్చారు.  కామిల్, రేష్మలకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.  వీరికి రెండేళ్ల పాప ఉంది.  అంబేడ్కర్ యూనివర్సిటీలో ప్యూన్‌గా పనిచేస్తూ కుటుంబంతో పాటు కమలా మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.

గత కొంత కాలంగా తన భార్య రేష్మ ఇద్దరు కుర్రాళ్లతో సన్నిహితంగా ఉంటుందని..వారితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని అనుమానం పెంచుకున్నాడు కామిల్.  ఈ నేపథ్యంలో శనివారం పీకల దాకా దాగి తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు.  ఆ గొడవలో భార్యను దారుణంగా పీక నులిమి చంపేశాడు.  భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న కామిల్ ఒక్కసారే భయపడిపోయాడు..ఏం చేయాలో అర్థం కాక ఆ శవంతోనే రెండు రోజులు గడిపాడు.

శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తన రెండేళ్ల కూతురితో పాటు భార్య శవం పక్కనే కూర్చొని ఉండిపోయాడు. చివరికి ఆదివారం ఉదయం కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినది చెప్పి లొంగిపోయాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామిల్ ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే రేష్మ శరీరం నీలంగా మారి దుర్వాసన రావడం మొదలైంది.  మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: