జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో దెందులూరు శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడైన చింతమనేని ప్రభాకర్ నీ టార్గెట్ చేసి తన జిల్లా పర్యటన ఎంతవరకు తీవ్రస్థాయిలో ఆయన వ్యవహారంపై మండిపడ్డారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకొని ప్రస్తుతం వేరే ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పై తాజాగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన కామెంట్లు చేశారు.
పవన్ కళ్యాణ్...మీ కాపు జాతి మొత్తం నా వెనక ఉంది..సినిమాల పరంగా నిన్ను అభిమానించే వచ్చు ఏమో గాని..రాజకీయంగా నాకు వెన్నుదన్నుగా వారు నిలుస్తున్నారని సంచలన కామెంట్లు చేశారు. ఈ క్రమంలో కొంతమంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు..పవన్ కళ్యాణ్ కి ఒక కులం అంటూ లేదని..ఆయన అందరివాడని...కాపు కులం అంటిస్తూ చింతమనేని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఇదే క్రమంలో మరికొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందినవారు రాజకీయ నాయకులు కులాన్ని అడ్డం పెట్టుకుని సమాజంలో ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడకూడదని అంటున్నారు.
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ముగించుకొని కొన్ని రోజులు గడుస్తున్నా..చింతమనేని వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతుండడం నిజంగా ఆశ్చర్యమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే వేడి ఎన్నికల దాకా ఉంటే దెందులూరు నియోజకవర్గం 2019 ఎన్నికల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతుందని జోస్యం చెబుతున్నారు.