నేడు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని..మొన్నటి వరకు బీజేపీతో గొప్ప జాతీయ పార్టీ అంటూ వెంట తిరిగిన ఆయన ఇప్పుడు బీజేపీని విమర్శించడం ఎంత వరకు సమంజసం అన్నారు. అవసరం ఉన్నంత వరకు ఎన్డీయేతో పొత్తు పెట్టుకొని ఎన్నికల ముందు యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఎన్డీయేను విమర్శించడం ఆయనకే చెల్లిందని అన్నారు. అనుభవం ఉన్న నాయకుడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి? అని అన్నారు.
ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి లెక్కచెప్పమంటే చెప్పట్లేదని, ఏపీకి కేంద్రం ఏం చేయట్లేదంటూ డ్రామాలాడుతున్నారని, ఒక సినిమా చూపించాలని చంద్రబాబు అనుకున్నారని, ప్రజలు, ప్రతిపక్షాలు ఆయనకు అసలు సినిమా చూపిస్తున్నాయని విమర్శించారు. వ్యాపారులు, దొంగ నాయకులపై ఐటీ దాడులు చేస్తే ముఖ్యమంత్రికి ఎందుకంత భయమన్నారు. చంద్రబాబు కోతల రాయుడు, అబద్ధాల రాయుడిగా మిగిలిపోతారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని, అప్పులు, ఆర్భాటాలేనని ఆరోపించారు.
హాయ్ల్యాండ్ను ప్రభుత్వ పెద్దలు కొట్టేయాలని చూశారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. బీజేపీ పోరాటం వల్లే ఆస్తులు కొట్టేయాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వ పెద్దలు వెనక్కి తగ్గారని చెప్పారు. చంద్రబాబు కోతల రాయుడు, అబద్ధాల రాయుడిగా మిగిలిపోతారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. అప్పులు, ఆర్భాటాలేనని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే అన్ని పార్టీలు ఖండించడం సహజం అన్నారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే అన్ని పార్టీలు ఖండించడం సహజమన్నారు.
జగన్ పై దాడి కేసును ‘ చంద్రన్న బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ తోనే విచారణ చేయిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని సృష్టించి, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని చంద్రబాబు అనుకున్నారేమో, అసలు సినిమా ప్రజలే చూపిస్తారని, ఆ తర్వాత వాళ్లందరూ ఇంటికి వెళ్లడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.