ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై ఇటీవల విశాఖపట్టణం విమానాశ్రయం లో జరిగిన హత్యాయత్నం విషయంలో చంద్రబాబు హుందాగా వెళ్లి జగన్ ని పరామర్శించకపోవడాన్ని రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు తప్పు పట్టిన విషయం మనకందరికీ తెలిసినదే. ఇదే క్రమంలో జగన్ పై దాడి జరిగిన సమయంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నాయకుల పై మరియు జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడటంతో చంద్రబాబు వ్యవహరించిన తీరు ని చాలా మంది తప్పుబట్టారు.
ఈ నేపథ్యంలో అసలు జగన్ ని ఎందుకు పరామర్శించలేధో తెలియజేశారు చంద్రబాబు. ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన చంద్రబాబు దాడి జరిగిన తర్వాత తాను జగన్తో ఫోన్లో మాట్లాడదామని అనుకున్నానని..
జగన్ తనని ఏ1 ముద్దాయి అనడంతో చాలా బాధ పడ్డానని అందుకే జగన్కు ఫోన్ చేయలేదని చంద్రబాబు అన్నారు. హత్యారాజకీయాలంటే తనకు పడదని.. తన ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా హత్యా ప్రయత్నాలు చేశానా అని చంద్రబాబు అన్నారు.
నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా కుట్రా రాజకీయాలు చేయలేదని.. అలాంటి నన్ను జనగ్ ఏ1 ముద్దాయి అన్నాడని అందుకే తనను పరామర్శించలేదని చంద్రబాబు అన్నారు. మరోపక్క వైసీపీ పార్టీకి చెందిన నేతలు కుట్ర మొత్తం నీ కనుసన్నుల్లో జరిగితే నువ్వెలా జగన్ ని పరామర్శించ గలవు అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.