కమెడియన్ పృథ్వి జగన్ దాడి  విషయం  లో టీడీపీ నాయకులూ , చంద్ర బాబు ప్రవర్తించిన తీరు ను తప్పు బట్టారు. జగన్ పై హత్యకు కుట్ర జరిగితే టీడీపీ నేతలు నవ్వుతూ ప్రెస్ మీట్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు పృధ్వి. ఒక జంతువుకు దెబ్బ తగిలితే 10 జంతువులు చుట్టూ చేరతాయి. ఆ పాటి జ్ఞానం, మానవత్వం కూడా టీడీపీ నేతలకు లేదన్నారు."కత్తి చిన్నదా పెద్దదా అనేది సమస్య కాదు. హత్యా ప్రయత్నం జరిగిందా లేదా అనేది చూడాలి.

Image result for comedian prudhvi

అదే కత్తి గుండెలో గుచ్చుకుంటే ఇంకో రకంగా ఉండేది. మెడపై తగిలితే మరో రకంగా ఉండేది. తీవ్రతను అర్థం చేసుకోవడం లేదు టీడీపీ. వీళ్లకు జరిగితే మాత్రం ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేస్తారు. ప్రతిపక్ష నాయకుడికి జరిగితే మాత్రం హాస్యం."  ఇదే దాడి చంద్రబాబుపై జరిగితే ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తారని, ఎయిర్ పోర్టులోనే దొర్లేసి రాష్ట్రమంతా రచ్చ చేస్తారని విమర్శించారు పృధ్వి. ధర్మపోరాటం టైపులో మరో పేరు పెట్టి, అడ్డంగా పడిపోయి దొంగ దీక్షలు చేసేవారని ఎద్దేవా చేశారు.

అది గరుడ పురాణం.. ఇది గవ్వల పురాణం

సింపతీ కోసం నటించాల్సిన అవసరం జగన్ కు లేదన్నారు. సింపతీ కోసం నటించాల్సిన అవసరం జగన్ కు లేదు. రాజశేఖర్ రెడ్డిగారి కుటుంబం డ్రామా కంపెనీ కాదు. డ్రామాలు వాళ్లకు ఇష్టం ఉండదు. పోనీ సింపతీ కోసమే చేశారనుకుందాం. అలాంటప్పుడు కత్తి తగలగానే కింద పడిపోవాలి కదా. నానా హంగామా చేయాలి కదా. రాష్ట్రమంతా అల్లకల్లోలం చేయాలి కదా. దెబ్బ తగిలినా సింహంలా లేచారు. నవ్వుతూ నడుచుకుంటూ వెళ్లిపోయారు. దటీజ్ జగన్" టీడీపీ జనాలు అనుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో హంగ్ లు, బొంగులు ఏం రావన్నారు పృధ్వి. అడ్డదిడ్డమైన సమీకరణాలు, కాంగ్రెస్ తో అక్రమ సంబంధాల్లాంటి వ్యవహారాలు వైఎస్ఆర్సీలో ఉండవన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: