జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ మీటింగుల్లో ఘాటైన‌ పదజాలం ఉపయోగిస్తున్నారు టీడీపీ తమ్ముళ్ళపై ఏకంగా బాణాలే వేస్తున్నారు. పవన్ మాటల ధాటికి టీడీపీ భావి నాయకుడు లోకెష్ కూడా విల‌విల్లాడుతున్నారు. మరో వైపు పసుపు పార్టీ అవినీతి కధలను కూడా పవన్ ఎక్కడికక్కడ వినిపించేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం బాగానే రాజుకుంటోంది.


మీ సంగతేంటి :


పంచాయతీ బోర్డ్ మెంబర్ కూడా కానీ లోకేష్ మనకు పంచాయతీ మంత్రి అంటూ పవన్ పేల్చుతున్న డైలాగులులు టీడీపీకి ఎక్కడ తాకాలో అక్కడే తాకాయి. దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్ పై ఇంత ఘాటుగా ఏ నాయకుడు నోరు చేసుకోలేదు. దాదాపుగా ప్రతీ మీటింగులో పవన్ లోకేష్ ని టార్గెట్ చేసుకుంటున్నారు. దీంతో మండుకొచ్చిన తమ్ముళ్ళు పవన్ పై రివర్స్ అటాక్ చేశారు. లోకేష్ సరే మీ సంగతేంటని నిలదీస్తున్నారు.


వార్డ్ మెంబర్ అయ్యారా :


జనసేన అధినాయకుడు పవన్ కనీసం వార్డ్ మెంబర్ అయినా అయ్యారా అంటూ పిఠాపురం ఎమ్మెల్యే వర్మ హాట్ కామెంట్స్ చేశారు. ఒకరిని అనే ముందు మీ సంగతి చూసుకున్నారా అని కూడా ప్రశ్నించారు. మీరు లోకెష్ నామస్మరణ చేయనిదే నిద్రపోయేలా లేరంటూ సెటైర్లు వేశారు. రాజకీయాల్లో మంచి భాష ఉపయోగించడం ముఖ్యమంటూ పవన్ కే వర్మ పాఠాలు చెప్పుకొచ్చారు.


బ్రొకర్లంటారా :


మేమేం తప్పుడు పనులు చేశామో నిరూపించండి, మమ్మల్ని బ్రోకర్లు అంటారా అంటూ వర్మ ఓ రేంజిలో పవన్ పైన విరుచుకుపడ్డారు. మేమేం అక్రమాలు చేశామో చెప్పగలరా, కనీసం మీకు అవగాహన ఉందా. ఏదో విమర్శించాలని అనడం కాదు, ఆధారాలు లేకుండా బురద జల్లేసి పోతే మేము కడుక్కోవాలా అంటూ వర్మ ఫైర్ అయ్యారు. తప్పుడు విమర్శలు చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పండని కూడా డిమాండ్ చేసారు.


పిఠాపురం నుంచి పోటీ:


పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో పవన్ పైన ఇలా ఘాటు వ్యాఖ్యలతో దూసుకురావడం బట్టి చూస్తూంటే పిఠాపురం అధికార టీడీపీ, విపక్ష జనసేనన మధ్యన  రణ రంగాన్ని తలపించేలా ఉందనిపిస్తోంది. ఇపుడే ఇలా ఉంటే రేపటి రోజున మరెన్ని మాటల యుధ్ధాలు ఉంటాయో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: