ఇటీవల విశాఖపట్టణం విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలో ఉన్న చాలామంది ప్రముఖ నాయకులకు షాక్ కి గురి చేసింది. గత రెండు వారాలుగా ఇదే విషయంపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా అనేక విమర్శలు తెలుగుదేశం పార్టీపై వచ్చాయి. దానికి కారణం జగన్ పై హత్యాయత్నం చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని చాలామంది ఆరోపించడం ..ఇదే క్రమంలో టీడీపీ నాయకులు జగన్ పై జరిగిన హత్యాయత్నం స్థలం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే స్థలమని కౌంటర్ ఇస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.

Related image

మరో పక్క జగన్ పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్ ని ఇప్పటికే చాలామంది సిట్ అధికారులు ప్రశ్నించడం విచారించడం జరిగింది...అయితే నిందితుడు నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ...జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పై మరియు కేంద్ర ప్రభుత్వం పై అనేక విమర్శలు వస్తున్నాయి.

Image result for jagan vishakapatanam airport

ఈ క్రమంలో తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకున్న జగన్ ...తాజాగా మళ్లీ ప్రజా సంకల్ప పాదయాత్ర కు రెడీ అయిపోయారు..ఈ క్రమంలో విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకున్న జగన్ కి విశాఖ వాసులు మరియు వైసీపీ కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు.ఈ క్రమంలో కాన్వాయ్ ఎక్కక ముందు విమానాశ్రయం లో ఉన్న అభిమానులకు వైసీపీ కార్యకర్తలకు జగన్ అభివాదం చేస్తూ ఎక్కడ కూడా బెదరకుండా ఆత్మవిశ్వాసం సన్నగిల్లి పోకుండా అద్భుతంగా దెబ్బతిన్న గాని..చెక్కు చెదరని దృఢసంకల్పంతో జగన్ అభివాదం చేయడంతో ఆ ప్రాంతమంతా జగన్ నినాదాలతో మారుమ్రోగిపోయింది.

Related image

ఈ క్రమంలో విజయనగరంలో మిగిలి ఉన్న ప్రజా సంకల్ప పాదయాత్ర చేయబోతున్న జగన్ కి విజయనగరం వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు..మరియు అదే విధంగా జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది జగన్ కు మరింత భద్రత కల్పించే విధంగా చర్యలు చేపట్టారు.ఇదే క్రమంలో విశాఖపట్నం లో జగన్ కి వచ్చిన భారీ స్వాగతం చూసిన కొంతమంది వైసిపి నాయకులు..ఇదే ఉపు ఓటు బ్యాలెట్ లో పడేదాకా కొనసాగితే..దేశంలోనే బలమైన ప్రభుత్వాన్ని జగన్ ఏర్పాటు చేయగలరని..కేంద్ర ప్రభుత్వాన్ని తన కనుసైగలతో జగన్ భవిష్యత్తులో శాసించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: