వచ్చే ఎన్నికల్లో హిందుపురం నియోజకవర్గంలో పోటీ చేసే విషయంలో బావమరది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. బాలకృష్ణ పరితీరుపై చంద్రబాబు చాలా సర్వేలు చేయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో సర్వేలు చేయించినట్లు ఇక్కడ కూడా చేయించారు. అయితే ఏ సర్వేలో కూడా బాలయ్యకు పాస్ మార్కులు రాలేదని సమాచారం. పార్టీ పెట్టిన దగ్గర నుండి తెలుగుదేశం ఓడిపోని నియోజకవర్గాల్లో హిందుపురం కూడా ఒకటి. అంటే ఈ నియోజకవర్గం టిడిపికి ఎంతటి కంచుకోటగా నిలుస్తోందో అర్ధం చేసుకోవచ్చు.

 

ఈ నియోజకవర్గోం ఎవరు పోటీ చేసినా అభ్యర్ధి ఎవరన్నది చూడకుండా జనాలు కేవలం ఎన్టీయార్ ను చూసి టిడిపిని గెలిపిస్తున్నారు.  అటువంటి నియోజకవర్గాన్ని బాలకృష్ణ చేతులారా కంపు చేసుకున్నారు. పోయిన ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుండి బాలకృష్ణ ఏనాడూ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. పోనీ నియోజకవర్గాన్ని పార్టీ నేతల చేతుల్లో పెట్టారా అంటె అదీ లేదు. ఓ పిఏని పెట్టి వ్యవహారాలు నడిపించారు. ఆ పిఏ మొత్తం నియోజకవర్గాన్నే కంపు చేసేశారు. అధికారులతో మాట్లాడక, నేతలతో టచ్ లో ఉండక మొత్తం నియోజకవర్గాన్ని బాలకృష్ణ గాలికొదిలేశారు. దాంతో బాలయ్యపై అటు జనాలు ఇటు పార్టీ నేతలు కూడా తిరుగుబాటు లేవదీసే స్ధితికి వచ్చింది.

 

నేతలు తిరుగుబాటు చేసే దశలో చంద్రబాబు జోక్యం చేసుకుని పరిస్ధితిని సర్దుబాటు చేసినా అప్పటికది తాత్కాలికమే అయ్యింది. మొత్తం మీద బాలకృష్ణ మీదైతే జనాల్లో, నేతల్లో అసంతృప్తి అయితే చల్లారలేదు. దాంతో చంద్రబాబు చేయించుకున్న ప్రతీ సర్వేలోనూ బాలయ్యకు మైనస్ మార్కులే వస్తున్నాయి. దాంతో ఇక లాభం లేదనుకుని వచ్చే ఎన్నికల్లో హిందుపురం నుండి బాలకృష్ణను పోటీ చేయవద్దని చంద్రబాబు చెప్పేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. మరి ఇక్కడి నుండి ఎవరు పోటీ చేస్తారనేది సస్పెన్సే. ఇక్కడి నుండి చంద్రబాబు పోటీ చేస్తారని కాదు లోకేషే చేస్తారని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. పోటీ చేసే విషయంలో మరికొద్ది రోజులు పోతే కానీ క్లారిటీ రాదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: