‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకి అంతకంతకూ మద్దతు పెరుగుతుంది. ఏనాడూ రోడ్డెక్కని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఎల్బీ స్టేడియం వద్ద ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు మద్దతు నిలబడ్డారు.

మైక్రోసాఫ్ట్ , సత్యం, ఐబిఎం,హెచ్ సిఎల్ వంటి ప్రముఖ సంస్థలే కాకుండా చాలా చిన్న, మధ్య తరహా సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు సభకు మద్దతుగా తరలి వచ్చారు.

ఇలా వచ్చిన వారిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఉండటం విశేషం. గత 4 సంవత్సరాలుగా ఐటి ఇండస్ట్రీ మిగిలిన అన్ని పరిశ్రమల కంటే ఎక్కువగా నష్టపోయింది. ఈ ప్రాంతీయ వాదం వలన కొత్త కంపెనీలు రావడం దేవుడెరుగ, ఉన్న కంపనీలు రాష్ట్రం వదిలి పోవడం మొదలవడంతో టెక్కీలు రోడ్డున పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: