విశాఖపట్నం విమానాశ్రయం లో జరిగిన హత్యా యత్నం విషయంలో వైఎస్ జగన్ పార్వతీపురంలో ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన కామెంట్ చేశారు. తనపై హత్యాయత్నం కుట్రపూరితంగా చంద్రబాబు చేయించారని బహిరంగ సభలో చంద్రబాబుపై విమర్శలు చేశారు జగన్. అంతేకాకుండా హత్యాయత్నం చేసి తన తల్లి చెల్లి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు దారుణంగా వ్యవహరించారని..అనవసరమైన ఆరోపణలు చేసి తన కుటుంబ సభ్యులను టిడిపి నాయకులు దూషించారని భావోద్వేగానికి లోనయ్యారు జగన్.

Image may contain: one or more people, crowd and outdoor

ప్రజాస్వామ్యం లో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇటువంటి ఆరోపణలు విన్నప్పుడు తనకు ఎంతో బాధ కలిగిందని ప్రజలకు తెలియజేశారు జగన్. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా నా ఆకరి చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతానని ప్రజా సమస్యలపై ఎంతవరకైనా ముందుకు వెళ్తానని హామీ ఇచ్చారు జగన్.

Image may contain: one or more people, crowd and outdoor

ఇటువంటి దాడులు చేసిన భయపడే ప్రసక్తి లేదని..ఎందుకంటే నేను ప్రజలను నమ్ముకున్న నాయకుడు నేను..నా తండ్రి ఇచ్చిన ఈ పెద్ద కుటుంబాన్ని నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో చాలా రాజకీయ శక్తులు ప్రజలతో..ప్రజల జీవితాలతో తమ స్వార్ధ రాజకీయాలకోసం ఆడుకున్నాయని..కానీ నేను అటువంటి నాయకుడిని కాదని..నా తండ్రిని ఎంతగానో రాజకీయాలలో ఆదరించారు..అటువంటి మిమ్మల్ని మీ కుటుంబాలని ఎప్పటికి నా కుటుంబం ల చూసుకుంటానని..ప్రజలకు హామీ ఇచ్చారు జగన్.

Image may contain: one or more people, crowd and outdoor

దీంతో హత్యాయత్నం జరిగిన తర్వాత మొట్టమొదటి సారి భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొన్న నేపథ్యంలో గతంలో కంటే జనాలు ఎక్కువగా జగన్ సభకు హాజరయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: