వైసీపీ లో విజయసాయి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ తరువాత నెం 1 లీడర్  విజయసాయి రెడ్డి మీద జగన్ కు అపార నమ్మకం కూడా .. అయితే చంద్ర బాబు మీద విజయ సాయి రెడ్డి చేస్తున్న సంచలనం రేపుతున్నాయి. తాజాగా బాబు మీద సెటైర్ల వర్షం కురిపిస్తున్నాడు.  కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించినట్లు తెలిసిందని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నందున తనను విస్మరించి నేరుగా ఇస్రో శాస్త్రవేత్తలను మెచ్చుకోవడం అయ్యారని తెలిసిందన్నారు. 


వైసీపీ లో ఆ ఎంపీ చంద్ర బాబు కు చుక్కలు చూపిస్తున్నాడు కదా.. సంచలన వ్యాఖ్యలు..!

‘శ్రీహరికోట సతీష్ ధావన్ సెంటర్ ఏర్పాటు చేసింది తానేనని అక్కడ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 1971లోనే తాను అప్పటి ప్రధానికి లేఖ రాసినట్లు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న విషయాలను గమనించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఏపీ సీఎం చెప్పినవి నిజమోనేమో అంటూ తలలు పట్టుకుంటున్నారట. కానీ 40 ఏళ్ల కిందటి రికార్డులు వారి వద్ద ఉండవన్న ధీమాతోనే చంద్రబాబు ఇలాంటి లేనిపోని గొప్పలు ప్రచారం చేసుకుంటున్నారని’ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

వైసీపీ లో ఆ ఎంపీ చంద్ర బాబు కు చుక్కలు చూపిస్తున్నాడు కదా.. సంచలన వ్యాఖ్యలు..!
తనను కేంద్ర విస్మరిస్తున్నందున పాఠ్యాంశాల్లో తన పాఠాన్ని చేర్చి, విద్యార్థులకు చిన్ననాటి నుంచే తన గొప్పలు తెలిసేలా చేస్తే వాళ్లు పెద్దవాళ్లయి తనకు ఓటేస్తారని చంద్రబాబు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, బేగంపేట విమానాశ్రయాన్ని తానే ఏర్పాటు చేశానని, రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాసిందని గతంలో పలుమార్లు గొప్పలకు పోయిన చంద్రబాబు అనంతరం తన వ్యాఖ్యలపై నాలుక్కరుచుకున్న విషయం తెలిసిందే. ప్రధాని పదవి ఆఫర్ చేస్తే సున్నితంగా తిరస్కరించానని, ఏపీ ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని పలుమార్లు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: