ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు మరీ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకపక్క మహా కూటమి నేతల పై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో పక్క బిజెపి నేతలు కూడా విమర్శల వర్షం ఆయా పార్టీల నాయకులపై చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నేత బాబు మోహన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులైన కెసిఆర్...కేటీఆర్ పై విమర్శలు వర్షం కురిపించారు.

Image result for బాబు మోహన్

ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో బాబు మోహన్ మాట్లాడుతూ కట్టు కథలు, పిట్ట కథలు, సూది కథలు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానపరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పడం లో కేసిఆర్ మించిన నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో లేరని విమర్శించారు.

Image result for kcr ktr

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం టిఆర్ఎస్ పార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు కాల్ టు ఆరోపణలు చేశారు. చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మునే తమ అభ్యర్థులకు ఆయన ఇస్తున్నారని ఆరోపించారు.

Image result for బాబు మోహన్

విచ్చలవిడిగా మద్యం సరఫరా చేసేందుకు లారీల్లో దిగుమతి అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు బాబు మోహన్.



మరింత సమాచారం తెలుసుకోండి: