మద్యప్రదేశ్,ఛత్తీస్ ఘడ్, మిజోరామ్, రాజస్థాన్ లలో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కి ఇక్కడ ఎడ్జ్ ఉంది అనే మాట ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఆఖరి రోజుల్లో , ఎన్నికలు దగ్గర పడుతోన్న టైం లో వస్తోన్న ప్రాథమిక రివ్యూ లు , సార్వే లు బీజేపీ కి మాత్రమే అధికారం దక్కుతుంది అని అంటున్నాయి.
అక్టోబర్ నుంచీ ఆ నెలాఖరు వరకూ గ్రాఫ్ ఒకలాగా ఉంది అనీ ఆ తరవాత లెక్క మారింది అనీ అంటున్నారు. కాంగ్రెస్ గత ఎన్నికల కన్నా కేవలం రెండు శాతం మాత్రమే ఓట్లు సంపాదిస్తుంది అనీ అంతకంటే కష్టం అనీ కొత్త లెక్కలు చెబుతున్నాయి. బీజేపీ మాత్రం మూడు నుంచి నాలుగు శాతం ఓట్లు పెంచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.
ఈ ఎన్నికల్లో 122 సీట్లు సాధించే దిశగా బీజేపీ వెళుతోంది అనీ తొంభై ఐదు స్థానాల వరకే కాంగ్రెస్ పరిమితం అనీ అంటున్నారు. అయితే బీఎస్పీ కి కేవలం మూడు సీట్లు దక్కే అవకాశం ఉంది.
ఇతరులకి పడి సీట్ల వరకూ రావచ్చు. మోడీ పర్యటన తరవాత ఈ ప్రాంతం లో ఇంకా పాజిటివ్ ధోరణి బీజేపీ పట్ల ప్రజల్లో కనిపిస్తోంది అంటున్నారు. మధ్య ప్రదేశ్ ఎన్నికలని బీజేపీ చాలా ప్రతిష్టాత్మకం గా తీసుకుంది. బూత్ కార్యకర్తల దగ్గర నుంచీ అనేకమంది తో సమాయత్తం అవుతోంది. అమిత్ షా ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారట !