టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ నటి అపూర్వ వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ను రెండు తెలుగు రాష్ట్రాలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో శ్రీముఖి కి పోటాపోటీగా మీడియా సమావేశాలు నిర్వహించి శ్రీను కే కే కౌంటర్లు వేసి వార్తల్లో నిలిచిన అపూర్వ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీపై మరియు వైసీపీ పార్టీ పై చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.

Image result for Apoorva press meet

నేను కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని అని నేను మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తానని ..అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో పరిస్థితి చూస్తే కమ్మ సామాజిక వర్గాన్ని పరువు తీసే విధంగా ఉందని..ముఖ్యంగా రెండు గోదావరి జిల్లాలో దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ వ్యవహారం అరాచకాలు దారుణం గా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు అతనిపై సరైన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అపూర్వ పేర్కొన్నారు.

Image result for Apoorva jagan

మరియు అదే విధంగా గత ఎన్నికల్లో జగన్ గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం మొత్తం రక్తపాతం అవుతుందని లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండదని తాను భావించానని..అయితే రోజురోజుకి జగన్ రాజకీయాలలో పరిణితి చెందడం చూస్తుంటే గతంలో జగన్ పై నాకున్న అభిప్రాయం తప్పని భావించానని.

Image result for Apoorva press meet

ఇటీవల ముఖ్యంగా విశాఖపట్టణం విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యా యత్నం విషయంలో ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా రక్తపాతం జరగకుండా జగన్ దాడి జరిగిన వెంటనే హుటాహుటిన ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని ఒక హుందా కలిగిన రాజకీయవేత్తగా విశాఖపట్టణం విమానాశ్రయంలో ఏటువంటి అల్లర్లు జరగకుండా జగన్ వ్యవహరించిన తీరు నాకు ఎంతగానో నచ్చింది అని దీంతో జగన్ పై గతంలో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నానని అపూర్వ చెప్పడంతో సోషల్ మీడియాలో అపూర్వ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: