పవన్ కళ్యాణ్ గారు తానూ నైతికత విలువలు ను పాటించకుండా కాకమ్మ కబుర్లు , నీతి వాక్యాలు చెబుతుంటాడు.  ఇక తనకు కుల రాజకీయం చేయడం రాదంటాడు.. మళ్లీ ఉదయం లేస్తే గోదావరి జిల్లాల చుట్టూరానే తిరుగుతున్నాడు. పవన్ రాజకీయం అక్కడే ఎందుకు సాగుతోంది అంటే.. అది చిన్న పిల్లాడికి కూడా అర్థం అయ్యే విషయమే. పవన్ సొంత కులస్తులు అక్కడ ఎక్కువ ఉన్నారు.. పవన్ కు కాస్తో కూస్తో సీట్లు వచ్చేది కాపులు ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతంలోనే అనే విశ్లేషణలు వినిపిస్తుంటాయి.


జగన్ మీద వ్యాఖ్యలతో తన స్థాయిని తానే దిగదార్చుకున్న పవన్ ..!

అందుకే పవన్ అక్కడే తిరుగుతున్నాడు. ఇలా కుల రాజకీయం చేస్తూనే.. తనకు కులమే లేదని, తను కాపునే కాదు అని పీకే చెప్పుకుంటూ ఉన్నాడు. ఇలా చెప్పేదెకటి చేసేదొకటి అన్నట్టుగా రాజకీయం చేస్తున్న పవన్ కల్యాణ్.. కు ఇప్పుడు లింగమనేని వ్యవహారం మరో బలహీనతగా మారుతోంది. సెంటు భూమి కూడా కోట్ల రూపాయలు పలికే ప్రాంతంలో పవన్ కల్యాణ్ కు లింగమనేని చాలా తక్కువ రేటుకు ఇవ్వడం వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తోంది.


జగన్ మీద వ్యాఖ్యలతో తన స్థాయిని తానే దిగదార్చుకున్న పవన్ ..!

పదుల కోట్ల రూపాయలు విలువ జేసే భూమిని పదుల లక్షల స్థాయికే పవన్ కల్యాణ్ కు ఇచ్చారనే ఆరోపణ మొదటి నుంచి ఉంది. దీనిపై జనసేన సమాధానం మాత్రంలేదు. అడ్డగోలుగా అందరి మీదా బురద జల్లే పవన్ కల్యాణ్.. ఈ విషయంలో మాత్రం సూటిగా, సుత్తిలేకుండా స్పందించలేకపోతున్నాడు! ,ముందు ఈ విషయం మీద ఎందుకు స్పదించవు. అవతలి వారి మీద అడ్డగులుగా రెచ్చి పోయి మాట్లాడతుంటావు .. ఇదేనా నీ నీతి...!

మరింత సమాచారం తెలుసుకోండి: