ఎన్టీఆర్ సుహాసిని కోసం వస్తున్నాడని ప్రచారానికి అంతా సిద్ధం చేసుకున్నాడని పచ్చ మీడియా కథనాల మీద కథనాలు అల్లుతుంది . అయితే  హరికృష్ణ కుటుంబంలో అందరినీ సంప్రదించారని, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రచారానికి వస్తున్నారని, పదేపదే వార్తలు ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. కానీ ఎన్టీఆర్ సైడ్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఆయన తన లేటెస్ట్ సినిమా షూట్ లో బిజీగా వున్నారు.

Image result for ntr jr

డిసెంబర్ పదివరకు అంటే ఎన్నికలు అయిపోయిన తరువాత మూడురోజుల వరకు ఫుల్ బిజీగా వుంటారు. క్యాన్సిల్ కొట్టాలంటే అవతల రామ్ చరణ్ కాంబినేషన్. రాజమౌళి డైరక్షన్. పోనీ కొట్టేస్తారు అనుకున్నా, అసలు రావాలని ఎన్టీఆర్ కు వుండాలి కదా? విశ్వసనీయ వర్గాలు మాత్రం, ఎన్టీఆర్ ప్రచారానికి రారు కాక రారు అనే అంటున్నాయి. తనను కార్నర్ చేయడానికి, తన కుటుంబంలో పుల్లలు పెట్టడానికి వండి వారుస్తున్న కథనాలు అన్నీ ఎన్టీఆర్ ఒక కంట గమనిస్తూనే వున్నారట.

'ఎన్టీఆర్' రారంటే.. రారు.. ఎంత పందెం చెప్పు..?

అన్నీ సహించి, మౌనంగా వుండాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ను విపరీతంగా అభిమానిస్తూ, ఆయనను దగ్గరగా గమనించే ఓ అభిమాని అయితే ఫోన్ లో ఇలా అన్నారు.. 'ఎన్టీఆర్ ప్రచారానికి రారు అని లక్ష రూపాయల పందెం' .. మరి అంత భరోసాకు, అంత ధీమాకు కారణం ఏమిటో? బాలయ్య అయితే ప్రచారానికి వస్తారు. సుహాసిని గెలుపు బాధ్యతను ఆయన తన భుజాన వేసుకున్నారు కాబట్టి, ఆయనకు తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: