ఎప్పుడు తప్పు చేస్తాడా ప్రజలలో పెట్టి అడ్డంగా విమర్శించాలి అని తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే ఎదురుచూసే ఎల్లో మీడియా ఛానల్ లు ముందుగా ఉండే ఒక ఛానల్ ఇటీవల జగన్ పై ఆసక్తికరమైన కథనాన్ని తన మీడియాలో ప్రసారం చేయడంతో ఈ విషయం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
ఇంతకీ విషయమేమిటంటే ఇటీవల 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచి మంత్రిగా ఉన్న గుంటూరు జిల్లా నేత ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ మంత్రి పదవి నుండి పార్టీ తొలగించడంతో..పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేపద్యంలో మరోపక్క ఎన్నికలు ముంచుకొస్తున్న క్రమంలో ..మరోపక్క ఆంధ్రరాష్ట్రంలో వైసీపీ పార్టీ రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతున్న క్రమంలో వైసీపీ పార్టీ లోనికి వస్తానని జగన్ కి తెలియజేశారట..అంతేకాకుండా సదరు నేత మీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానని జగన్ కి తెలియజేశారట.
దీంతో జగన్ నా దగ్గర ఇటువంటివి కుదరవని ఆలోచన మార్చుకోవచ్చని సదరు నేతకు జగన్ తెలియజేయడంతో ఆ నేత షాక్ తిన్నాడట. ఇదే విషయం ఆ దమ్మున్న చానల్ తెలియజేయడంతో సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా సదరు మీడియా ఛానల్ అధినేత జగన్ క్లియర్ అండ్ ప్యూర్ పొలిటీషియన్ అని అన్నట్లు టాక్.
మరోపక్క ఈ విషయం తెలుసుకున్న సీనియర్ రాజకీయ నాయకులు...ముందు నుండి జగన్ తనని నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయం చేయకుండా ఎక్కడా కూడా రాజీ పడకుండా నిలబడుతున్నాడు అని రాజకీయాలలో ప్రస్తుత రోజుల్లో ఈ విధంగా రాణించాలంటే చాలా కష్టమని కానీ జగన్ తన తండ్రిని పోగొట్టుకున్న తనని నమ్ముకున్న నాయకులకు మాత్రం భరోసా ఇస్తూ వారికి అండగా ఉంటూ స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారని తమ కామెంట్లతో సర్టిఫికెట్లు ఇస్తున్నారు.