ఈ మద్య దొంగలు రక రకాలుగా దోచుకుంటున్నారు. ఈజి మనీకోసం ఎంత ఘాతుకానికైనా తెగబడుతున్నారు. తాజాగా బెంగుళూరులో దారుణం జరిగింది. ఓలా క్యాబ్ డ్రైవర్ ని కొట్టి అతని వద్ద ఉన్న డబ్బు దోచుకోవడమే కాకుండా అతని ద్వారా భార్యకు వీడియో కాల్ చేసించి నగ్నంగా ఉండమని చెప్పి స్క్రీన్ షార్ట్స్ తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో సోమశేఖర్ ఓలా క్యాబ్ను నలుగురు వ్యక్తులు బెంగళూరులోని అడుగోడి నుంచి దొమ్మసంద్ర వెళ్లేందుకు బుక్ చేసుకున్నారు.
సాధారణ ప్యాసింజర్లనుకొని సోమశేఖర్ ఆ నలుగురిని కారు ఎక్కించుకొని వెళ్తున్న అర్థగంట తర్వాత వారి నిజస్వరూపాన్ని బయట పెట్టారు. సోమశేఖర్ బెదిరించి కొట్టి అతని వద్ద ఉన్న తొమ్మిది వేలు లాక్కున్నారు..అంతే కాదు అతని స్నేహితులకు ఫోన్ చేయించి డబ్బులు అడగాలని కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. స్నేహితులు పంపిన రూ. 20 వేలను వారు తమ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని తెలిపాడు. కారును మధ్యలో ఆపి ఆ డబ్బులను డ్రా చేసుకున్నారని తెలిపాడు. ఆ తర్వాత మరో దారుణానికి తెగబడ్డారు దుండగులు. తన భార్యకు వీడియో కాల్ చేయించి బలవంతంగా దుస్తులు విప్పించారని, ఆ దృశ్యాన్ని స్క్రీన్ షాట్లు తీసుకున్నారని సోమశేఖర్ కన్నీరు పెట్టుకున్నాడు. ఇక తనను పక్కకు జరిపి వారు కార్ డ్రైవ్ చేస్తూ దాదాపు వంద కిలోమీటర్లు చుట్టూ తిప్పారని..తర్వాత రామనగర జిల్లా చెన్నపట్టణలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లారని తెలిపాడు. తాను టాయిలెట్ కి వెళ్తున్నానని చెప్పి కిటీకీ ద్వారా బయటపడ్డానని..లేదంటే తనను కూడా ఏదైనా చేసి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం చెన్నపట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకున్న సోమశేఖర్ జరిగిన దారుణాన్ని వివరించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లాడ్జీకి వెళ్లే సరికే దుండుగులు పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.