కేసీఆర్ మంచి మారికారి ఇది అందరికీ తెలిసిందే . అయితే కొన్ని సార్లు మరీ నోరు జారీ విమర్శల పాలు అవుతుంటాడు. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్ చేసి ఇరుకున పడ్డాడు. నాగర్ కర్నూలు సభలో అయితే.. తన సొంత పార్టీ ఎమ్మెల్యేల గురించి తాను ఎలా మాట్లాడుతాడో.. కేసీఆర్ లైవ్ ప్రసంగంలో చూసిన వారికి దిమ్మ తిరిగింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ మరీ ఇలా మాట్లాడుతాడా అని విన్నవాళ్లు నివ్వెరపోయారు. ప్రజా ఆశీర్వాద సభలతో తెలంగాణ మొత్తం చుట్టేస్తున్న కేసీఆర్, తన ప్రచారంలో విఫక్ష పార్టీల నేతలకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.


చంద్ర బాబు దగ్గర పని చేయడం పై తన మీద తానే సెటైర్స్ వేసుకున్న కేసీఆర్...!

ప్రధాని మోడీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సహా అన్నిపార్టీల నాయకులపై విమర్శలు తీవ్రంగా చేస్తున్నారు. కేసీఆర్ విపక్ష నేతలపై అదేపనిగా చేస్తున్న ఆరోపణలపై తెలంగాణలోని వారికి కూడా అభ్యంతరాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ కేసీఆర్ ఏమాత్రం వెనకడుగు వేయకపోగా తన విమర్శల జోరును కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో అనేకసార్లు తనకు ఇష్టంలేని నేతలపై ఏకవచన సంబోధనలతో కేసీఆర్ విరుచుకుపడటం కూడా వివాదాస్పదం కావడం తెలిసిన విషయమే. తాజాగా కేసీఆర్ తన పార్టీ ఎంఎల్ఎలపై కూడా అనుచితమైన భాషను ఉపయోగించేస్తున్నారు.


చంద్ర బాబు దగ్గర పని చేయడం పై తన మీద తానే సెటైర్స్ వేసుకున్న కేసీఆర్...!

నాగర్ కర్నూల్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్, తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, మిషన్ భగీరధ గురించి మాట్లాడుతూ... తాను ఈ పథకంపై తన పార్టీ ఎంఎల్ఎలతో మాట్లాడుతూ ‘‘ అభ్యంతరకరమైన తిట్టు వాడుతూ .. మిషన్ భగీరధ పూర్తి అయిన తరువాత, తెలంగాణలో ఏ ఆడబిడ్డ అయినా, బిందె పట్టుకుని రోడ్డు మీదకు రావాలె..  మీ అంతు చూస్తా’’ అన్నానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ నోట అన్యాపదేశంగా ఆ మాటలు వచ్చినప్పటికీ, కేసీఆర్ మాటతీరు పట్ల ప్రజలలో ఆయన చులకన అయ్యే అవకాశం ఉంది. తన పార్టీ ఎంఎల్ఎలను ఉద్దేశించి అన్నప్పటికీ, వారు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు కావడంతో ప్రజలు తమను అగౌరవ పరచినట్లుగా భావించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: