కూకట్ పల్లి లో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని ఎన్నికల భరిలో దిగటం తో అందరి కళ్ళు ఆ నియోజక వర్గం మీద పడ్డాయి.  సుహాసిని గెలుపును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆమెకు అన్ని విధాలా సహకరించాలంటూ తెలంగాణ టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు - సుహాసినిని ఓడించడం ద్వారా చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పాలని భావించిన టీఆర్ ఎస్ కూడా తమ అభ్యర్థి గెలుపు కోసం పట్టుదలతో కృషి చేసింది.

Related image

పోలింగ్ ప్రశాంతంగా ముగిసినప్పటికీ కూకట్ పల్లిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. టీ కొట్టులు - హోటళ్లు.. ఇలా ఎక్కడ చూసినా జనం ఒక విషయమే చర్చించుకుంటున్నారు. ఆ వంద కోట్లు ఏమయ్యాయి? వంద కోట్లు పంచేశారా? అంత డబ్బు ఎక్కడికి పోయింది?కూకట్ పల్లిలో ప్రధాన పోటీ టీఆర్ ఎస్ - ప్రజా కూటమి మధ్యే. అందుకు తగ్గట్లే ప్రచార పర్వం హోరెత్తింది. సుహాసిని తరఫున చంద్రబాబు - బాలయ్య ప్రచారంలో పాల్గొన్నారు.

Related image

టీఆర్ ఎస్ అభ్యర్థి తరఫున కేటీఆర్ స్వయంగా ప్రచారానికి విచ్చేశారు. ప్రచార గడువు ముగిశాక నియోజకవర్గంలో భారీగా డబ్బు చేతులు మారిందని.. ప్రజా కూటమి - టీఆర్ ఎస్ పోటీ పడి ఓటర్లకు డబ్బులు పంచాయని పలువురు చెబుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇచ్చారని అంటున్నారు. ప్రజా కూటమి - టీఆర్ ఎస్ కలిసి ఏకంగా రూ.100 కోట్లు పంచి పెట్టాయని సూచిస్తున్నారు.ఈ వంద కోట్ల విషయం ఇప్పుడు ఒక్క కూకట్ పల్లిలోనే కాదు రాష్ట్రమంతటా చర్చనీయాంశమవుతోంది. ఒక్క సీటు కోసం అంత భారీగా డబ్బు ఖర్చు చేశారా అంటూ అంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో సుహాసిని గెలుస్తుందా అంటే ఎక్కువ గా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: