ముందుగా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ తో విజేతలు ఎవరు అనే విషయం తేలబోతోంది. కౌంటింగ్ కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లూ చేసింది. మధ్యాహ్నం పన్నెండు- ఒంటిగంటకు అంతా పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశాలున్నాయి. విజయం పట్ల నేతల కాన్ఫిడెన్స్, గెలుపు ఎవరిదనే అంశం గురించి ఉన్న అంచనాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ అంచనాలు, విశ్వాసాల గురించి ఇప్పుడు చర్చ అనవసరం.
మరి కాసేపట్లో అసలు విషయం తెలిసిపోబోతోంది. తెలంగాణ విషయానికి వస్తే మొదటి అధికారిక ధ్రువీకరణ బెల్లంపల్లిలో జరగవచ్చని అంటున్నారు. చివరి ఫలితంగా శేరిలింగంపల్లి విజేత ప్రకటన జరగవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు మొదలైంది. కూటమి గెలుస్తుందో.. కారు సత్తా చూపిస్తుందో మరి కాసేపట్లో పూర్తి స్పష్టత వస్తుంది.