చంద్రబాబునాయుడు ఇచ్చిన డబ్బుతోనే నటుడు, ఆపరేషన్ గరుడతో పాపులరైన శివాజి ఫ్లాట్లు కొన్నాడా ? ఇపుడిదే హాట్ టాపిక్ గా మారింది. రాజధాని పరిధిలోని గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శివాజి ప్రత్యక్షమయ్యాడు. చాలా కాలంగా శివాజి మీడియాలో ఎక్కడా కనబడటం లేదు.  వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి  మీద మొన్న అక్టోబర్ 23వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగినప్పటి నుండి మాయమైపోయారు. ఆ తర్వాత అమెరికా నుండి ఓ వీడియోలో ప్రత్యక్షమైనా నేరుగా మాట్లాడింది మాత్రం లేదు. అలాంటిది హఠాత్తుగా గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు.

 

విషయం తెలిసిన వెంటనే మీడియా కూడా గన్నవరానికి చేరుకున్నది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం శివాజి వచ్చినట్లు తెలిసింది. శివాజిని ఫొటోలు తీసుకునేందుకు మీడియా ఎగబడింది. దాంతో శివాజికి ఒళ్ళు మండిపోయింది. మీడియాపై ఇష్టం వచ్చినట్లు ఎగిరెగిరిపడ్డారు. తనను ఫొటోలు, వీడియోలు తీస్తే మర్యాదగా ఉండదంటూ వార్నింగ్ కు కూడా ఇచ్చారు. అయినా మీడియా లెక్కచేయకుండా పొటోలు, వీడియోలు తీసేసింది. దాంతో శివాజి తిట్ల దండకం అందుకున్నారు.

 

అదే సమయంలో మీడియాపై విరుచుకుపడిన శివాజి ఏం రాస్తారో రాసుకోండి అంటూ మండిపడ్డారు. మహా అయితే, చంద్రబాబు ఇచ్చిన డబ్బుతోనే శివాజి ఫ్లాట్లు కొన్నాడని రాసుకుంటారు అంతే కదా ? ఇష్టం వచ్చినట్లు రాసుకోండి అంటూ ఊగిపోయారు. నిజానికి శివాజి చెప్పేంత వరకూ తెలీదు ఆయన ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చాడని. గన్నవరం దగ్గర ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్ధకు చెందిన నిర్మాణాల్లో రెండు ఫ్లాట్లను శివాజి కొన్నాడట. వాటి రిజిస్ట్రేషన్ల కోసమే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: