తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోరంగా ఓడి పోవడం తో జగన్ ఇంకా దూకుడు ను పెంచుతున్నాడు . టీడీపీ నుంచి పెద్ద తలకాయలను లాగే ప్రయత్నం చేస్తున్నాడు . ముఖ్యంగా టీడీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు - ఇమడలేకపోతున్న సీనియర్ నేతలతో వైసీపీ టచ్ లోకి వెళ్తోంది.    కీలక నేత విజయసాయిరెడ్డే స్వయంగా పలువురు టీడీపీ నేతలకు ఫోన్ చేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ భవితవ్యం ఎలా ఉండబోతోందో చెబుతున్నారట.

Image result for jagan

తెలంగాణలో వచ్చిన రిజల్టే ఏపీలోనూ వస్తుందని.. టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని.. రానున్నది జగన్ ప్రభుత్వమేనని ఆయన నేతలకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలూ ఇదే అంచనాలతో ఉండడంతో వారు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. మరోవైపు విజయసాయి రెడ్డి టీడీపీలోని ఓ పెద్ద నేతతో టచ్ లో ఉన్న సంగతి ఆ పార్టీ అధిష్ఠానం గుర్తించి ఆ నేతను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.


వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి గతంలో వెళ్లడంతో అక్కడ టీడీపీలో పోటీ ఉంది. దీంతో టిక్కెట్లపై నమ్మకం లేని నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాల్లోనే విజయసాయి రెడ్డి ఉన్నట్లు సమాచారం. దీంతో టీడీపీ పెద్దల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. దీనితో ఎన్నికల లోపు ఏమైనా జరగొచ్చని అందరూ భావిస్తున్నారు . దీనితో 2019 ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా సాగుతాయనడం లో ఎటువంటి సందేహం లేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: