ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై మాటల దాడి పెంచారు. 2019 ఎన్నికల్లో టికెట్ కోసమో లేక పోతే మరొక పదవి కోసమో తెలియదు గానీ అనంతపురం జిల్లా పార్లమెంటు సభ్యుడు టిడిపి నాయకుడు జెసి దివాకర్ రెడ్డి జగన్పై రోజురోజుకి దారుణమైన వ్యాఖ్యలు చేస్తే ఆంధ్ర రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు.

Image result for jagan sharmila

ఇటీవల జగన్ కి కుల రాజకీయాలు ఎక్కువ అని ఇందుమూలంగా రెడ్డి కులస్తులను రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కులం పేరుతో ఎవ‌రూ ముఖ్య‌మంత్రి కాలేద‌ని, సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జనార్దన్‌రెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్ర‌జాద‌ర‌ణ‌తోనే ముఖ్య‌మంత్రులు అయ్యార‌ని.. నీకు ఇంత కుల పిచ్చి ఏంటో త‌న‌కు అర్ధం కావ‌డంలేత‌ని జేసీ అన్నారు.

Related image

ఇక జ‌గ‌న్ నీ చెల్లి ఏ కుల‌స్తుడిని పెళ్లి చేసుకుంది.. బ్రాహ్మ‌ణుడినే క‌దా.. అయితే పెళ్లి చేసుకునేట‌ప్పుడు అడ్డం రాని కులం, ఓట్లు అడిగేట‌ప్పుడు మాత్రం ఎందుకు వ‌స్తుంది అని జేసీ ప్ర‌శ్నించారు. ఇక ఇప్ప‌టికైనా జ‌గ‌న్ త‌న తీరును మార్చుకోవాల‌ని.. లేక‌పోతే జీవితంలో ముఖ్య‌మంత్రి కాలేర‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి అన్నారు.

Image result for jagan sharmila

దీంతో జేసీ దివాకర్రెడ్డి చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 2014 ఎన్నికలలో కాపులను బీసీల్లో చేరుస్తానని తర్వాత అంతకు ముందు ఎస్సీ వర్గీకరణ చేపడతానని దళితుల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల కోసం కుటుంబ సభ్యులపై వివాదాస్పదంగా మాట్లాడటం మంచిది కాదని కొంతమంది వైసీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి కి చురకలు అంటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: