త్వరలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల రాజకీయ నేతలు ప్రజల్లో బలంగా పర్యటిస్తూ ఎన్నికలకు తమ పార్టీ లను సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తాజాగా బీజేపీ కూడా తన పనులను మొదలు పెట్టింది.

Image result for modi

ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ప్రధాని మోడీ విశాఖ పట్టణంలో ఉన్న బిజెపి కార్యకర్తలతో మరియు నాయకులతో రాబోయే ఎన్నికల గురించి ఎలా వ్యూహాత్మకంగా వెళ్లాలో పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడిన మోడీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ విషయాలలో విఫలమయిందో ప్రతి విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని పేర్కొన్నారు.

Related image

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నిధుల విషయంలో ప్రస్తుతమున్న ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుందని ఈ విషయాలను బలంగా తీసుకొని అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మోడీ కోరారు.

Related image

మొత్తంమీద రాబోయే ఎన్నికల కోసం ప్రధాని మోడీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలంగా పర్యటించడానికి అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో అన్న విషయాల గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రముఖ పట్టణాలలో భారీ బహిరంగ సభలు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించినట్లు బిజెపి నాయకులు నుండి వినిపిస్తున్న సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: