జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మరి సెంటర్ ఆఫ్ హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు జనసేన పార్టీ తమతోనే ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి.

Related image

దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు ఎంతో కలవరపడుతున్నా సమయంలో వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి రానున్న ఎన్నికల్లో కుదిరితే వామపక్ష పార్టీలతో కలిసే ఉంటాం తప్ప వేరే పార్టీతో పొత్తు అనేది లేదని తేల్చిపారేశారు.

Image result for janasena pithani balakrishna

ఇదే క్రమంలో జనసేన పార్టీ మొట్టమొదటి అభ్యర్థి పితాని బాలకృష్ణ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు తప్పుదోవ పట్టించడానికి అధికారం మరియు ప్రతిపక్ష పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Image result for janasena pithani balakrishna

అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి రానున్న రోజుల్లో విపరీతమైన వలసలు ఉండబోతున్నాయి అని అందుకే తెలుగుదేశం అధిష్టానం ఆ వలసలను ఆపేందుకే వారు మరియు పవన్ కలిసే ఉన్నామని చెప్తూ రాష్ట్ర ప్రజలతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రాబోయే ఏపీ ఎన్నికలలో జనసేన ప్రభంజనం ఎవరు ఆపలేరని కావాలి కదా అని కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు పితాని బాలకృష్ణ.



మరింత సమాచారం తెలుసుకోండి: