తెలుగు రాజకీయాలలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో అనేక ఇంటర్వ్యూలో పాల్గొన్న కేఏ పాల్ ప్రధాన రాజకీయ పార్టీల నేతలపై సెటైర్లు వేస్తూ అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేసేవారు.
ఈ క్రమంలో త్వరలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో కేఏ పాల్ పాల్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీని గెలిపిస్తే నియోజకవర్గానికి 100 కోట్లు చొప్పున విరాళం ఇస్తానని 20 రోజుల్లో తమ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. పెద్ద నోట్ల ముసుగులో దేశంలో భారీ అవినీతి జరిగిందని కేఏ పాల్ ఆరోపించారు. అన్ని మతాల వారు భయంతో బతుకున్నారని పేర్కొన్నారు. పార్టీలో వెయ్యి మందిని చేర్పించిన వారికి రూ.3 వేల చొప్పున ఇస్తానని కేఏ పాల్ ప్రకటించారు. దీంతో కేఏ పాల్ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా కేఏ పాల్ చేసిన కామెంట్ లపై సెటైర్లు వేస్తున్నారు.