మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసిపి ఎంఎల్ఏ రోజా ఫుల్లుగా ఫైర్ అయ్యారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభ వేదిక దగ్గరకు గనుక వచ్చుంటే జనం మంత్రిని కిందపడేసి తొక్కేసుండేవారంటూ మండిపోయారు.  అసలే సోమిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటమంటే రోజాకు చాలా ఆనందం. పోయి పోయి సోమిరెడ్డి అనవసరంగా రోజాను కెలుక్కున్నారు. జగన్ పాదయాత్ర ముగింపు సభ గురించి మంత్రి మాట్లాడుతూ, జగన్ ముగింపు సభకు జనాలు రాలేదంటూ ఎద్దేవా చేశారు. దాంతో రోజాకు వొళ్ళు మండిపోయింది.

 

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రోజా మాట్లాడుతూ సోమిరెడ్డి వ్యాక్యలకు రియాక్టయ్యారు. ఐదుసార్లు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మంత్రి పదవి తీసుకున్నందుకు సోమిరెడ్డి సిగ్గుపడాలంటూ ఎద్దేవా చేశారు. వరుసగా అన్నిసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి కూడా జగన్ పాదయాత్ర గురించి మాట్లాడుతున్నందుకు సిగ్గుపడాలన్నారు. పనిలో పనిగా చంద్రబాబునాయుడును కూడా రోజా దులిపేశారు. ఐదుసార్లు ఓడిపోయిన వాళ్ళకు, ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రిపదవులు కట్టబెట్టటానికి చంద్రబాబుకు సిగ్గుండాలంటూ దులిపేశారు.

 

జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని  కోడి కత్తి అంటూ  ఎగతాళి చేస్తున్న టిడిపి నేతలందరూ జైలుకెళ్ళి రోజు తొందరలోనే వస్తుందంటూ రోజా జోస్యం  చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. సరైన భద్రత కల్పించుంటే జగన్ పై హత్యాయత్నం జరిగుండేదే కాదని అభిప్రాయపడ్డారు. జగన్ కు వస్తున్న జనాధరణ చూడలేకే ప్రభుత్వ పెద్దలు ఈర్ష్యతో మండిపోతున్నారంటూ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: