వైసీపీకి జనాదరణ పెరుగుతోంది ఆ పార్టీలో చేరేందుకు పెద్ద తలకాయలు ఇపుడు రెడీ అవుతున్నాయి. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో సంక్త్రాంతి తరువాత ఓ రేంజిలో భారీ చేరికలు ఉంటాయని అంటున్నారు. ఇందులో బిగ్ షాట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. అధికార పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యేలా వైసీపీ వ్యూహాలు ఉంటాయని, ఏపీ రాజకీయాలను వేడెక్కించే పని ఇపుడు వైసీపీ చేతుల్లోనే ఉందని అంటున్నారు.


చిన్నమ్మ చేరిక :


ఇక పోతే వైసీపీలోకి అన్న గారి కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటు పురంధేస్వరి కుటుంబం చేరికకు రంగం సిధ్ధమైంది. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 21న మొత్తం కుటుంబం వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తన కుమారుడు హితైష్ రాజకీయ భవిష్యత్తును ద్రుష్టిలో పెట్టుకుని చిన్నమ్మ వైసీపీని బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకున్నారని అంటున్నారు. జగన్ సైతం ఇందుకు సుముఖంగా ఉండడంతో దగ్గుబాటి ఫ్యామిలీ చేరిక ఇక లాంచనమేనని చెబుతున్నారు.


అక్కడ పీటముడి :


ఇక జగన్ నుంచి కచ్చింతైన హామీని తీసుకునే పార్టీలోనికి రావాలని దగ్గుబాటి ఫ్యామిలి డిసైడ్ అయింది. ఒంగోలు జిల్లా పరుచూరు టికెట్ కుమారుడు హితైష్ కు తనకు గుంటూర్, నరసారావుపేటలల్లో ఒక దానిలో  ఎంపీ టికెట్ పురందేశ్వరి కోరుతున్నారు. అయితే జగన్ ఆ విషయంలో ఏమి  చెప్పారన్నది తెలియడం లేదు. ఎందుకంటే గుంటూరు ఎంపీ టికెట్ వివాదంలోనే సినీ నిర్మాత, క్రిష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు అలిగి వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అక్కడ జగన్ ఎంపిక చేసిన అభ్యర్ధులు  ఉన్నారు. అలాగే పరుచూరుకి కూడా జగన్ ఇంచార్జిని  రెడీ చేసి  ఉంచారు. ఇపుడు ఆయన్ని మార్చడం అంటే కష్టమే కానీ దగ్గుబాటి కుటుంబం కొసం కొన్ని మార్పులకు జగన్ సిద్ధపడుతున్నారని అంటున్నారు.


ఆ సామాజికవర్గం అండ :


పురందేశ్వరి వైసీపీలోకి వస్తే రాష్ట్రంలో అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కీలకమైన సామజిక వర్గం అండ వైసీపీకి దొరుకుతుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి అన్న గారి పట్ల జగన్ ఇప్పటికే తన అభిమానం చాటుకున్నారు. క్రిష్ణా జిల్లాకు అయాన పేరు పెడతానని కూడా చెప్పుకొచ్చారు. ఇపుడు అదే అన్న గారి ఫ్యామిలి నుంచి కీలకమైన నాయకులు వైసీపీలో చేరితే పార్టీకి మరింతగా బలం వస్తుందని అంచనాలు వేస్తున్నారు. మరో వైపు పురంధరేశ్వరి కూడా మంచి నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది వైసీపీకి ఒక అసెట్ గా ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే అన్న గారి కుటుంబ సభ్యులతో పాటు కొంతమని బిగ్ షాట్స్ ని వైసీపేలఒకి తీసుకోవడం ద్వారా జగన్ టీడీపీకి భారీ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: