ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కేసీఆర్ తనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసిన చంద్రబాబు కి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించాయి.

Image result for chandrababu

ఇదే క్రమంలో చంద్రబాబు కూడా కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు సరైన రీతిలో నే కౌంటర్లు కూడా వేశారు. అయితే మరి కొద్ది నెలల్లో ఏపిలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల కేటీఆర్ మరియు జగన్ ల భేటీ గురించి చంద్రబాబు తాజాగా పార్టీ నేతలతో సమావేశమైన టెలీ కాన్ఫరెన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

Image result for chandrababu kcr

ముఖ్యంగా గతంలో కెసిఆర్ ,కవిత, కెటిఆర్,హరీష్ లు మాట్లాడిన వాటిని ప్రజలలో ప్రచారం చేయాలని ఆయన సూచించారు. వారితో జగన్ కలుస్తున్నారని ప్రచారం చేయాలని చంద్రబాబు అన్నారు. అంతేకాక మోడీతో జగన్ లాలూచీ పడ్డారని కూడా ప్రచారం చేయాలని నేతలకు చెప్పారు.

Related image

చంద్రబాబు గొప్పదనం ఏమిటంటే అలాంటి పార్టీతో,నేతలతో 2009 లో ఎందుకు పొత్తు పెట్టుకున్నది? తెలంగాణ అసంబ్లీ ఎన్నికలలో ఎందుకు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే యత్నం చేసి విఫలం అయింది చెప్పకుండా ,టిఆర్ఎస్ పై ప్రజలలో ద్వేషాలు పెంచాలని రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడిన ఏ ఒక్కరిని వదలకూడదని ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: