ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఒకపక్క సర్వేలు మరోపక్క రాజకీయ పార్టీ నేతల మీటింగులు, పోత్తులు, ప్రకటనలతో ఆంధ్ర రాజకీయం రసవత్తరంగా మారింది. మూడు అతిపెద్ద పార్టీలు ఉన్నా కానీ పోటీ మాత్రం టీడీపీ మరియు వైసీపీ మధ్య అని చాలామంది విశ్లేషిస్తున్నారు.

Related image

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఏపీలో ఎన్నికలలో మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు.

Image result for chandrababu jagga reddy

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చంద్రబాబు మంచి విజన్‌ కలిగిన నాయకుడన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి వెనక చంద్రబాబు కృషి ఎంతగానో ఉందని స్పష్టం చేశారు.

Image result for chandrababu

ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్‌ బతికితేనే ప్రజలకు మంచిదన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందని పేర్కొన్నారు. అప్పుడు హోదా అడగని కేసీఆర్‌ ఇప్పుడు అడగడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మెదక్‌ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మొత్తంమీద జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి .



మరింత సమాచారం తెలుసుకోండి: