నాగబాబు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జనసేన కు మేలు చేద్దామని రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారు. ఈ విషయం క్లియర్ కట్ గా తెలిసి పోతుంది. మొదట బాలకృష్ణ  ను టార్గెట్ చేసినప్పుడు కారణాలు చెప్పాడు. ఇప్పడూ అందరి రాజకీయ నాయకులను కెలుకుతున్నాడు. మరీ ఇప్పడూ కారణాలు ఏమని అంటే నా ఇష్టం నా ఛానెల్ అంటున్నాడు. ఈసారి వైఎస్ జగన్ పై కామెంట్ చేశాడు. ఇటీవల టీవీ9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలను తీసుకుని నాగబాబు వాటిపై సెటైర్ వేశాడు.

Image result for nagababu

ఆ ఇంటర్వ్యూలో జగన్.. 'ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ మాటలు అడగరు? అడగాలంటే ఆయన చేసిన అవినీతి అలా ఉంది అక్కడ దాని మీద ఎంక్వౌరీ ఏ స్టేజీలో జరుగుతుందో నాకు అయితే తెలియదు. బహుశా నా స్టేజీ కూడా దాటి పోయి కోర్టు స్టేజీ కూడా దాటిపోయి...' అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలపై నాగబాబు వ్యంగ్యాస్త్రాలను సంధించాడు.వీడు నా కంటే గొప్పవాడు అన్నప్పుడు.. నేను గొప్పవాడినే కాని వాడు నాకంటే గొప్ప వాడు అనే అర్థం వస్తుంది ఇతను నాకంటే ఎక్కువ సాధించాడు అంటే నేను బాగానే సాధించాను కాని అతడు నా కంటే ఎక్కువ సాధించాడు అనే అర్థం అక్కడ వస్తుంది.


వాడు నాకంటే పెద్ద ఎదవ అనే వ్యాఖ్యకు నేను వెదవనే కాని వాడు నాకంటే పెద్ద ఎదవ అనేది ఆ మాటలో అర్థం. ఇక్కడ కూడా జగన్ గారు నా స్టేజీ కూడా మించి పోయారు అంటూ చెప్పారు. అంటే అవినీతిలో జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక స్టేజీ ఉందని ఆ స్టేజీని చంద్రబాబు నాయుడు దాటేశాడు అంటూ జగన్ స్వయంగా ఒప్పుకున్నాడంటూ నాగబాబు కామెంట్ చేశాడు. తనకంటే ఎక్కువ స్టేజీకి వెళ్లిన చంద్రబాబు నాయుడును చూసి ఒకరకంగా జగన్ మోహన్ రెడ్డి గారు జెలసి ఫీల్ అవుతున్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలను వింటుంటే అనిపిస్తుందంటూ నాగబాబు కాస్త ఎటకారంగా కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: