తెలుగుదేశం పార్టీకి ముందు నుండి అండగా ఉన్నది బీసీ వర్గానికి చెందిన ప్రజలేనని ఇటీవల ఉండవల్లి లో జరిగిన ప్రజావేదిక లో బీసీ నేతల సమావేశంలో స్పష్టం చేశారు చంద్రబాబు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం తీసుకొనే నిర్ణయాలలో బీసీలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటానని బీసీలే నాకు హైకమాండ్ అని సంచలన కామెంట్ చేశారు చంద్రబాబు.
మరియు అదే విధంగా ఈ నెల 27న రాజమహేంద్రవరంలో జరగనున్న ‘జయహో బీసీ’ సదస్సుపై చర్చించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు అధికార గర్వం కానీ. ఏమరుపాటు కానీ లేవని. వెనుకబడిన వర్గాలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
కొన్ని వర్గాలు కొన్నిసార్లే టీడీపీకి ఓటు వేశాయని.. బీసీలు మాత్రం ఎప్పుడూ వెన్నంటే ఉన్నారన్నారు. అలాంటి బీసీలను మరచిపోతే తనను తాను మరిచిపోయినట్టేనని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీ గ్రూపుల్లో మార్పులు, రిజర్వేషన్ల శాతంపై చర్చ జరగాలన్నారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరగబోతుందని ప్రస్తుతం లో జరుగుతున్న అభివృద్ధి ఇంకా కొనసాగాలంటే కచ్చితంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని స్పష్టం చేశారు చంద్రబాబు. ఏదిఏమైనా బీసీ ప్రజలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదన్నట్టుగా ఈ సమావేశంలో ప్రసంగించారు చంద్రబాబు.