మోహన్ బాబు మైకు తీసుకుంటే చాలు ఉన్నది ఉన్నట్టు ఉన్నట్టు మొహం మీద కొట్టి నట్టు చెబుతాడు. చాలా మంది మైకు తీసుకోని అవతలి వారికి సోఫ్ వేస్తుంటారు. కానీ డైలాగ్ కింగ్ అలా కాదు. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడి అవతలి వారికి ముచ్చెమటలు పట్టిస్తుంటారు. మ్యాటర్ లోకి వెళ్తే.. దాసరి విగ్రహావిష్కరణకు పాలకొల్లు వెళ్లారు మోహన్ బాబు. విగ్రహ ఆవిష్కరణ తర్వాత చాలా ఆవేశంగా మాట్లాడారు.

Image result for mohan babu

దాసరి పుట్టినూరు పాలకొల్లులో ఇంత గొప్పగా విగ్రహం పెడితే.. హైదరాబాద్ లో కనీసం విగ్రహం పెట్టేందుకు స్థలం కూడా ఇవ్వలేదని బాధపడ్డారు. అంటే.. మోహన్ బాబు పరోక్షంగా తెలంగాణ సర్కార్ ఇవ్వలేదని చెప్పినట్లే. సాధారణంగా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మినహా మిగిలిన వారెవ్వరూ కామెంట్ చేసేందుకు సాహసించరు. సినిమా వాళ్లు అయితే మరీ. కాళ్లమీద పడరు కానీ అంతకన్నా ఎక్కువే.


కానీ మోహన్ బాబు స్టైలే డిఫరెంట్. ఆయన మనసులో ఉన్నది బయట చెప్పడానికి ఏ మాత్రం మోహమాట పడరు. అందుకే.. ఉన్న విషయాల్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీనితో అందరూ మోహన్ బాబు మజాకా అంటున్నారు. ఇప్పటికైనా తెలంగాణ సర్కార్. . దాసరి విగ్రహం పెట్టేందుకు స్థలం కేటాయిస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: