దేశంలో త్వరలో లోక్ సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ పై దేశంలో ఉన్న ప్రముఖ పార్టీలో ఇప్పటికే కూటమిగా ఏర్పడటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఇటీవల పశ్చిమబెంగాల్లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ రాజకీయాలను రసవత్తరం చేశారు.

Image result for modi

మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వాటిల్లే రోజులు వస్తాయని దేశంలో సామాన్యుడు బ్రతికే రోజులు కరువై పోతాయని చాలామంది జాతీయ నాయకులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రధాని మోడీపై ఆమ్ ఆద్మిపార్టీ అధినేత, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శల ఘాటు పెంచారు.

Image result for modi kejriwal

పిల్లలపై ప్రేమలేని తల్లితండ్రులు మోడీకి ఓటు వేయాలని సూచించారు.డిల్లీలో పదకుండువేల క్లాస్ రూమ్ లకు ఆయన శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు.

Image result for modi kejriwal

మోడీ ఒక్క తరగతి క్లాస్ రూమ్ నిర్మించలేదని, స్కూల్ నిర్మించలేదని, మీ పిల్లలపై ప్రేమ ఉంటే, మీ చిన్నారుల కోసం పనిచేస్తున్నవారికి ఓటు వేయాలని, పిల్లలపై ప్రేమే లేకపోతే మోడీకి ఓటు వేయవచ్చని ఆయన సూచించారు.ఉప ముఖ్యమంత్రి సిసోడియా మాట్లాడుతూ డిల్లీలో కష్టపడి పనిచేసే ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: