అదేదో పాత సినిమాలో ఓ కోపిష్టి యజమాని తనకు ఆవేశం వచ్చినప్పుడల్ల కొట్టేందుకు, తిట్టేందుకు ఓ మనిషిని ఏర్పాటు చేసుకుంటాడు. ఏపీలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఇక్కడ కనీస మాత్రం బలం లేని బీజేపీకి గత ఏడాదిగా తిడుతూ వచ్చారు. ఇపుడు అసెంబ్లీ జరుగుతోంది. మరో వైపు ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. ప్రత్యేక హోదా పేరుతో హడావుడీ చేస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో బీజేపీ ఎమ్మెల్యే రాజు  బాబుకు అడ్డంగా దొరికిపోయారు.


తమాషాగా ఉందా : 


అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. కేంద్రం చాలానే ఇచ్చిందని లెక్కలు చెబుతుంటే చంద్రబాబు మధ్యలో అడ్డుకున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విష్ణుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. కేంద్ర సంస్థలు ఎవరి కోసం ఇస్తారని.. ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉండటానికి విష్ణుకుమార్ రాజుకు అర్హత లేదన్నారు. రక్తం ఉడికిపోతుందన్నారు. ‘‘ఎవరికి ఊడిగం చేస్తారు? ఏం చేస్తారయ్యా మీరు? జైల్లో పెడతారా... ఆవేదన ఉండదా మాకు? తమిళులకి ఎన్ని ఇచ్చారు? గుజరాత్‌కి ఎన్ని ఇచ్చారు.? రోషం లేదా? తమాషాగా ఉందా..న్యాయం జరిగేంత వరకు వదిలి పెట్టాం. వినేవాళ్లు ఉంటే చెవుల్లో పువ్వులు పెడతారండి. మహిళలు వచ్చి.. పోరాడతామంటున్నారని.. పెన్షన్ డబ్బులు విరాళంగా ఇస్తున్నారని .. ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా అని అడుగుతున్నారని.. సాధారణ మహిళలకు ఉండే పరిజ్ఞానం మీకు లేదా’’ అని ప్రశ్నించారు.


విస్తుబోయిన రాజా వారు :


ఇలా బాబు తిట్ల దండకం లంకించుకుంటే  విస్తుబోవడం రాజా వారి వంతు అయింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అందునా నలభయ్యేళ్ళ అనుభవం కలిగిన నాయకుడు, ప్రతిపక్ష నాయకునిపై సహనం కోల్పోయి చేసిన ఈ కామెంట్స్ ఇపుడు బాగా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: