ఆంధ్రరాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం వైసిపి పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఒకపక్క జనసేన పార్టీ ఉన్నాగాని నిర్మాణ దశలోనే ఉండటంతో ఆ పార్టీపై ఎక్కువగా పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు ప్రజలు.

Related image

ఇదిలా ఉండగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు  కేఏ పాల్ ఒకపక్క సీరియస్గా రాజకీయాలు జరుగుతుంటే మరోపక్క ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మరియు నవ్వు తెప్పించే విధంగా ఉంటున్నాయి.

Image result for ka paul

ఇప్ప‌టికే రోజుకో ర‌కంగా వార్త‌ల్లో నిలిచే పాల్ ఈ సారి అన్ని పార్టీల నేత‌ల‌పై విరుచుక‌ప‌డ్డారు. ఏపీని చంద్రబాబు నాశనం చేశారంటూ ఫైర్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబును భూస్థాపితం చేస్తానన్నారు. అక్క‌డితే ఆగ‌కుండా పులివెందులలో జగన్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, చిన్న చిన్న పార్టీలన్నీ తనతో కలిసి రావాలని కోరారు.

Image result for ka paul

అన్ని పార్టీలు క‌లిసి వ‌స్తే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామ‌ని పిలుపునిచ్చారు. అంతేకాదు తాను అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి ఓ కార్పొరేట్ ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఎన్నికల ముందు వచ్చిన గాని కేఏ పాల్ అద్భుతంగా ప్రచారం చేసుకుంటున్నారని కొంతమంది సోషల్ మీడియాలో కేఏ పాల్ కి అభినందనలు తెలుపుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: