కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని దారుణంగా మోసం చేసిందని విభజన హామీల విషయంలో మొండితనంగా వ్యవహరించిందని ఇటీవల జాతీయ మీడియా ఛానల్ ముందు మరియు రాష్ట్ర వీడియో ఛానల్ ను ముందు లబోదిబోమంటున్నారు టిడిపి నేతలు.
ఇదే క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా భారీ బహిరంగ సభలలో ప్రజా కార్యక్రమాలలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వం పట్ల ఏ విధంగా వ్యవహరించింది వంటి విషయాలను చాలా క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మోడీకి దేశం అంతటా తెలిసిలా నిరసనలు తెలపాలని ఆయన పిలుపు ఇచ్చారు.
విభజన గాయంపై కారం చల్లి మోడీ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన అన్నారు.మోడీ ప్రస్టేషన్ లో ఉన్నారని, రేపు గుంటూరు వచ్చి ప్రస్టేషన్ లో మాట్లాడతారని ఆయన అన్నారు.
రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి ఏపీ వచ్చారని దేశమంతా తెలిసేలా నిరసనలు తెలపాలని ఆయన పార్టీకి పిలుపు ఇచ్చారు. . అంతా పసుపు చొక్కాలు ధరించి ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని కోరారు. గాంధీజీ స్పూర్తితో రేపు, ఎల్లుండి ఒక చీకటి దినంగా భావించి కసి పట్టుదలతో అందరూ నిరసనలు తెలపాలని సూచించారు. మొత్తం మీద టీడీపీ శ్రేణులు మోడీకి నిరసన శాఖతో ఏపీ యొక్క పౌరుషాన్ని చూపించాలని భావిస్తున్నారు.