ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ఏపీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై మరింతగా విరుచుకుపడుతున్నారు. గడిచిన సంవత్సరాలు తన పాలనలో కేంద్ర ప్రభుత్వం సరిగ్గా సహకరించలేదని కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాజకీయపరంగా చూసిందని విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత కష్టాలు పాలు చేసిందని ముఖ్యంగా బిజెపి పార్టీ గురించి తీవ్ర స్థాయిలో చంద్రబాబు ఇటీవల సంచలన కామెంట్ చేశారు.

Image result for chandrababu

ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పై చంద్రబాబు ఊహించని విధంగా కామెంట్లు చేశారు. విభజన గాయం ఇంకా మానలేదని,అయినా ప్రధాని మోడీ వచ్చి ఎపికి ఏమి చేశామో చెప్పకుండా ,తనను తిట్టడానికి వచ్చినట్లు వ్యవహరించారని ఆయన అన్నారు.మోడీ తనను తిట్టి పారపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర హక్కుల కోసం ఇప్పటికే పోరాడుతూనే ఉన్నామని ఆయన అన్నారు.

Image result for chandrababu modi

కాంగ్రెస్‌ పార్టీ తల్లిని చంపి బిడ్డను కాపాడిందని మోదీ చెప్పారు. తల్లిని కూడా దగా చేసిన వ్యక్తి మోడీ అని చంద్రబాబు తీవ్రంగా వ్యాఖ్యానించారు. భాజపాతో పొత్తు పెట్టుకోకపోతే 15 సీట్లు అదనంగా వచ్చేవి.

Related image

మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలను ఊచకోత కోశారు. అప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశా. అది మనసులో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నారు. నేను ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచానని అంటున్నారు. గురువుకు నామాలు పెట్టింది మీరు. అడ్వాణీ నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం మీది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: