ఇప్పుడు సోషల్ మీడియా యుగం కావటం తో రాజకీయ నాయకుల పప్పులు ఉడకటం లేదు. ఏం మాట్లాడిన ఇట్టే దొరికి పోతున్నారు. లేకపోయివుంటే, బాబుగారి కోడి, కుంపటి మాత్రమే వుండి వుంటే, వాళ్లు చెప్పేవే నిజాలని, వాళ్లు ప్రవచించేవే సుభాషితాలని జనం ఇంకా నమ్ముతూ వుండేవారు. వాళ్లు అలా నమ్మబలుకుతూ వుండి వుండేవారు. మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా తెలుగుదేశం అనుకూల జనాల మాటలకు ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలో బలంగా కౌంటర్లు పడ్డాయి.


ఈ విధంగా లోకేష్ సభ నవ్వుల పాలైంది ...!

జగన్ ఎక్కడ దాక్కున్నారో కేసులకు భయపడి అని నారాలోకేష్ ట్వీటు వేయగానే, పాత వీడియోలు, పాత ప్రకటనలు బయటపెట్టి, ఆయనను మారు మాట్లాడకుండా చేసారు.హోదా వస్తే ఆకాశం నుంచి అన్నీ ఊడిపడతాయి అనుకుంటున్నారు, ఇక ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంటన్నారు అంటూ గతంలో లోకేష్ చెప్పిన మాటల వీడియోలను సోషల్ మీడియాలో వుంచారు.


ఈ విధంగా లోకేష్ సభ నవ్వుల పాలైంది ...!

అలాగే శభాష్ మోడీ అంటూ చంద్రబాబు ప్రశంసలను, సోనియాపై చేసిన విమర్శలను మాజీ చీఫ్ సెక్రటరీ కృష్ణారావు ట్విట్టర్ లో వుంచారు. డిజిటల్ యుగం కావడంతోనూ, మోడీతో విడాకులు జరిగి ఇంకా ఎంతోకాలం కాకపోవడంతోనూ, బాబు అప్పట్లో చేసిన ప్రసంగాలు, ఇచ్చిన స్టేట్ మెంట్ లు అన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు బయటపెడుతూ ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తంమీద మోడీ పర్యటనలో బయటదేశం నాయకులు వైకాపా మీద దాడిచేస్తుంటే సోషల్ మీడియాలో జనాలు దేశం మీద దాడిచేస్తూ ఆడేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: