ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  వేగంగా ఆలోచనలు చేస్తారు. ఆయన పాదరసం కంటే జోరుగా వ్యూహాలకు పదును పెడతారు. ఆయన దూకుడుని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు, వర్తమాన రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు వేయాలంటే బాబుని మించిన వారు లేనే లేరు.


మరిన్ని నిర్ణయాలు :


ఓ వైపు ఎన్నికలు తరుముకువస్తున్నాయి. ఏడు జిల్లాలకు సంబంధించి శాసన మండలి ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఈ నెల 14న విడుదల కాబోతోంది. దాంతో ఎటువంటి అధికార ప్రకటన‌ చేయాలన్నా, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. దీంతో చంద్రబాబు బాగా తొందరపడుతున్నారు. ఈ నెల 13న నిర్వహించే మంత్రివర్గ సమావేశాలో మరిన్ని సంచలన నిర్ణయాలు వెలువడవచ్చునని అంటున్నారు. 
ఇప్పటికే వరాల జల్లు కురిపించిన చంద్రబాబు ఇంకా మిగిలిన వర్గాలకు, మరిన్ని కొత్త పధకాలకు కూడా తాయిలాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రతి ఇంటికీ కనీసం ఒకటి రెండు పధకాలతో పాటు, అన్ని వయసులు వారికీ తప్పనిసరిగా ఒక పధకం అమలు అయ్యేలా బాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో బాబు ప్రకటించే ఆ సంచలన నిర్ణయాలు ఏంటన్నది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.


విశాఖలో సుడిగాలి పర్యటన :


ఇదిలా ఉండగా చంద్రబాబు విశాఖలో ఈ నెల 13న ఒక రోజు సుడి గాలి పర్యటన చేయబోతున్నారు. ఆ రోజున ఆయన రికార్డ్ స్థాయిలో ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేస్తారని అంటున్నారు. ఎన్నికల్ కోడ్ వచ్చేలోగా అన్ని పనులు పూర్తి చేయాలని బాబు కచ్చితమైన నిర్ణయంతో ఉన్నారని అంటున్నారు. మొత్తానికి బాబు జోరు మామూలుగా లేదుగా.


మరింత సమాచారం తెలుసుకోండి: