ఏ పార్టీ అధినేత కు అయినా పార్టీ లో అసమ్మతి సెగలు , రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడం చాలా కష్టం. ఇప్పటికే 40 ఏళ్ళు అనుభవం ఉన్న చంద్ర బాబు పార్టీ లోని ఎమ్మెల్యేలను కొన్ని సార్లు కంట్రోల్ చేయలేక పోయాడు. అయితే జగన్ మాత్రం రాజాం పేట మేటర్ ను తేలిగ్గా తేల్చేసాడంట ... గడచిన ఎన్నికల్లో కడప జిల్లాలోని ఒక్క రాజంపేట అసెంబ్లీ మినహా అన్ని స్థానాలను వైసీపీ గెలుచుకుంది. రాజంపేటలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన మేడా మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అక్కడ ఫిరాయింపు నేత మంత్రి ఆదినారాయణ రెడ్డి జోక్యం అధికం కావడంతో మేడా పార్టీ మారిపోయారు.

Image result for jagan

టీడీపీకి ఆ పార్టీ టికెట్ పై అందిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసిన మేడా... వైసీపీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యే టికెట్ మేడాకే కేటాయించాలని వైసీపీ నిర్ణయించేసింది. మరి గడచిన ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన అమర్ నాథ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఇదే వివాదానికి దారి తీసింది. మేడాకు టికెట్ ఇస్తే.... ఆది నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న తానెక్కడికి పోవాలంటూ అమర్ నాథరెడ్డి అడిగిన ప్రశ్న కూడా సబబుగానే ఉంది.అయితే ఇద్దరికీ ఒకే సారి టికెట్టు ఇవ్వడం కుదరదు కదా. ఇదే అంశంపై రాజీమంత్రాన్ని రచించిన జగన్... దానిని చిటికెలోనే పరిష్కరించేశారు.

Image result for jagan

జగన్ రచించిన వ్యూహాన్ని అమలు చేసిన పార్టీ యువనేత రాజంపేట తాజా మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి... మేడాతో పాటు అమర్ నాథరెడ్డిని రాజంపేటలో కూర్చోబెట్టారు. ఎమ్మెల్యే పదవిని వదిలేసుకుని వచ్చిన మేడాకు టికెట్ ఇవ్వాల్సిందేనని అదే సమయంలో మేడా విజయానికి అమర్ కృషి చేయాల్సిందేనని ఆయన వారిద్దరికీ తేల్చి చెప్పారు. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే... అమర్ కు ప్రాధాన్యం కలిగిన పదవితో పాటు నియోజకవర్గంలో మంచి ప్రాధాన్యం దక్కేలా చూసుకోవాల్సిన బాధ్యత మేడాదేనని కూడా చెప్పారు. ఈ రాజీ మంత్రానికి ఇద్దరు నేతలు అక్కడికక్కడే సరేననేశారు. మొత్తంగా రాజంపేట పంచాయతీ సింగిల్ సిట్టింగ్ లో సెట్ అయిపోయిందన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: