జగన్మోహన్ రెడ్డితో అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లో జరిగిన వీరిద్దరి భేటీ సినీ, రాజకీయ రాంగాల్లో సంచలనంగా మారింది. చాలా కాలంగా నాగార్జున వైసిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో నాగార్జున గుంటూరు ఎంపిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రచారాన్ని నాగార్జున కానీ వైసిపి వర్గాలు కానీ ఖండించలేదు.

 

ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో టిడిపి నుండి వైసిపిలోకి వలసలు ఊపందుకుంటున్న విషయం చూస్తున్నదే. అదే సమయంలో సినీరంగానికి చెందిన పలువురు ఆర్టిస్టులు కూడా జగన్ ను కలిసి మద్దతు తెలుపుతున్నారు. పృధ్వి, పోసాని కృష్ణ మురళి, భానుచందర్ తదితరులు వైసిపిలో యాక్టివ్ గానే ఉన్నారు.

 

ఈ నేపధ్యంలోనే సినీ హీరో నాగార్జున జగన్ ను కలవటం ప్రాధాన్యత సంతరించుకున్నది. విషయం ఏమిటంటే, లోటస్ పాండ్ లో జగన్ ను కలసిన తర్వాత నాగార్జున మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. దాంతో అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: