ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ లండన్ టూరు పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా వైసీపీ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు గెలవడం ఖాయమని అన్ని సర్వేలలో తేలడంతో జగన్ ముఖ్యమంత్రి అవడం గ్యారెంటీ అని ఫలితాలు రావడంతో ఏదో రకంగా వైసిపి పార్టీపై బురద చల్లాలని ఏపీ రాష్ట్రంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు జగన్ లండన్ టూర్ గురించి అనేక సెటైర్లు వేస్తున్నారు.
ఇదిలావుండగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పోబియా బాగానే పట్టుకున్నట్లుంది. తెలుగుదేశం మీడియాలో వచ్చిన ఒక కదనం ప్రకారం జగన్ లండన్ పర్యటనపై కూడా ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు కనిపిస్తోంది.
హవాలా డబ్బు తెచ్చుకునేందుకే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారని చంద్రబాబు ప్రచారం ఆరంబించారు. ఎన్నికలకు ముందు విదేశీ పర్యటనకు వెళ్లరని, జగన్ ఎందుకు వెళ్లారని కూడా ఆయన అన్నారు. మళ్లీ ఆయనే ఈ ఆరోపణ చేసేశారు.
మొత్తంమీద జగన్ లండన్ టూర్ పై ఏపీ లో ఉన్న రాజకీయ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే మరోపక్క వైసిపి పార్టీ శ్రేణులు మాత్రం జగన్ తన కూతురిని చూడటానికి మాత్రమే లండన్ టూర్ వెళ్లారని వ్యాఖ్యానిస్తున్నారు.